Tribal University Bill
- ఇటీవల కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు సమ్మక్క- సారక్క గిరిజన యూనివర్సిటీ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు
- ఈ గిరిజన యూనివర్సిటీ పేరును చేర్చుతూ ప్రస్తుతం ఉన్న కేంద్ర యూనివర్సిటీ చట్టానికి సవరణలు ప్రతిపాదించారు
- 2009 సెంట్రల్ యూనివర్సిటీ చట్టాన్ని సవరించాలి
- తెలంగాణ రాష్ట్రంలో ఈ యూనివర్సిటీనీ ఏర్పాటు చేస్తున్నారు
- స్థానిక ప్రజలకు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుంది
- గిరిజన కలలు, సంస్కృతి సాంప్రదాయాలో పై పరిశోధనలు చేయవచ్చు
- ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించవచ్చు
- ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 :- ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఒక గిరిజన యూనివర్సిటీ ని ఏర్పాటు చేయాలి
- అందులో భాగంగానే ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు
- ఈ విశ్వవిద్యాలయానికి అయ్యే ఖర్చు 889 కోట్లు
- దీనిని ఏడు సంవత్సరాల లో పూర్తి చేయనున్నారు
- ఇందిరా గాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ(మొట్టమొదటి గిరిజన విశ్వవిద్యాలయం)
- ప్రస్తుతం దేశంలో 27 Tribal Research Instituteలు ఉన్నాయి
06/12/2023 PDF File :- LINK
TODAY PDF File :- LINK
27/11/2023 PDF File :- LINK
సైబర్ నేరాలు
- ఇటీవల జాతీయ నేరాల నమోదు సంస్థ (NCRB) దేశవ్యాప్తంగా 2022 లో నమోదైన నేరాలకు సంబంధించి ఒక నివేదికను రూపొందించింది
- ఆ నివేదికలో సైబర్ నేరాలు మరియు నకిలీ వార్తలను వ్యాప్తి చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది
- హత్యలు, దొంగతనాలు, దోపిడీ వంటి సాంప్రదాయ నేరాల విషయంలో రాష్ట్రంలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది
మిజోరంలో కొత్త పాలన పగ్గాలు
- మిజోరం రాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టడం కోసం ఐదేళ్ల కిందట జోరం పీపుల్స్ మూమెంట్ పార్టీ గట్టి ప్రయత్నాలు చేసింది
- అప్పుడు ఆ రాష్ట్ర ప్రజలు ఆ పార్టీకి 8 సీట్లు కట్టబెట్టారు
- మిజోరాంలో మనకు 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి
- కొత్తగా జోరం పీపుల్స్ మూమెంట్ పార్టీ 27 స్థానాలను గెలుచుకుంది
- కారణాలు
- BJP నేతృత్వంలో ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి (NEDA) అనేది ఒకటి ఏర్పడింది
- ఈ కూటమిలో మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీ భాగస్వామిగా ఉంది
- మణిపూర్ లో కుకిలపై దాడులు జరుగుతున్నాయి
- ఈ కుకిలకు, మిజోరంలో ప్రజలకు సన్నిహిత సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి
- మణిపూర్ లో కుకిలపై జరుగుతున్న దాడులను అడ్డుకోవడంలో కమలదళం విఫలమైంది మిజోరాం ప్రజలు జోరం పీపుల్స్ మూమెంట్ పార్టీకి పాలన పగ్గాల అందించారు
- మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీ NEDA లో భాగస్వామిగా ఉన్నప్పటికీ కూడా ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా పోటీ చేసింది
- జోరాంథంగా పై అవినీతి ఆరోపణలు రావడం ,ఆయన ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసించకపోవడం ఇలా పలు అంశాలు ఆయనకు ప్రతికూలంగా మారాయి
హైకోర్టు జడ్జిల బదిలీలు
- హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలకు సంబంధించి కొత్త విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో కేంద్రం అడుగులు వేస్తుంది
- కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ న్యాయవాద వృత్తి నియంత్రణ బిల్లుపై లోక్ సభలో చర్చ జరుగుతున్నప్పుడు ఈ అంశాన్ని తెలియజేశారు
- 1993లో మనకు కొలీజియం వ్యవస్థ అనేది అందుబాటులోకి వచ్చింది
- ఆ సుప్రీంకోర్టు యొక్క కొలీజియం సిఫార్సుల ఆధారంగానే
- జడ్జిల యొక్క బదిలీలు గాని, నియామకాలు గాని చేపట్టుతున్నారు
ప్రభుత్వ ఉద్యోగాలు. మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం. ఇక్కడ అందుబాటులో ఉంటుంది.
వాటిని అందరికంటే ముందుగానే పొందాలి అంటే YouTube Channel నీ Subscribe చేసుకోండి.
TODAY PDF File :- LINK
Comments
Post a Comment