డోక్లాం పై కన్నేసిన డ్రాగన్
- భారత్, భూటాన్ ల మధ్య ఎప్పటినుంచో మనకు సన్నిహిత సంబంధాలు బలంగా ఉన్నాయి
- ఈ రెండు దేశాల మధ్య 1949 సంవత్సరంలో స్నేహ పూర్వక మరియు సహకార ఒప్పందానికి సంబంధించి ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది
- ఈ ఒప్పందం ప్రకారం :-
- భారత్ భూటాన్ యొక్క సార్వభౌమత్వాన్ని పరిరక్షిస్తూ ఉండాలి
- ఆ దేశ విదేశాంగ విధానానికి భారతదేశం మార్గదర్శకత్వం వహిస్తూ ఉండాలి.
- అది మాత్రమే కాదు ఉమ్మడి భద్రతకు సంబంధించి భరోసాన కల్పించాలి
- ఈ ఒప్పందం ప్రకారమే భారత్ సైన్యం భూటాన్ లో స్థావరాలు ఏర్పరచుకుంది
- చైనా-భూటాన్ సరిహద్దు ప్రాంతాల్లో పహారాను కాస్తుంది
- భారత సరిహద్దు రహదారుల నిర్మాణ సంస్థ భూటాన్ లో పలు మౌలిక వసతులను కూడా నిర్మించింది
- భూటాన్ సైనికులకు భారత సైన్యం శిక్షణను కూడా అందిస్తుంది
- నాటి ప్రధానిగా ఉన్న జవహర్ లాల్ నెహ్రూ గారు భూటాన్ పై దాడిని భారత్ పై దాడిగానే పరిగణిస్తామని 1958 లో నెహ్రూ గారు పార్లమెంటులో ప్రకటించడం కూడా జరిగింది
- నెహ్రూ గారు పార్లమెంట్లో ఈ ప్రకటన ప్రకటించడాని కంటే ముందే చైనా టిబేట్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది
- చైనా యొక్క వర్షన్
- చైనా టిబేట్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడమే కాదు లడక్ నేపాల్ సిక్కిం భూటాన్ అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ కూడా టిబేట్ ప్రాంతానికి సంబంధించి చేతికి అయిదు వేళ్ళు గా ప్రకటించింది
- భూటాన్ లోని డోక్లాంతో సహా మొత్తం 764 చదరపు కిలోమీటర్ల భూభాగం తనదేనని డ్రాగన్ దబాయిస్తుంది
08/11/2023 PDF File :- LINK
TODAY PDF File :- LINK
06/11/2023 PDF File :- LINK
జికా వైరస్
- ఇటీవల కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ గ్రామం నుండి సేకరించిన దోమల నమూనాలో జికా వైరస్ ను గుర్తించడంతోని ఈ అంశం వార్తల్లో నిలిచింది
- ఈ జికా వైరస్ కి సంబందించి పుట్టు పూర్వోత్తరాలు:-
- ఈ వైరస్ దోమల ద్వారా సంక్రమించే ఒక ఫ్లేవీ వైరస్.
- ఇది ప్రధానంగా ఏడేస్ దోమల ద్వారా వ్యాపిస్తుంది
- ఈజిప్టు జాతికి చెందిన ఈడిస్ దోమల ద్వారా ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుందని గుర్తించాలి
- ఈ వైరస్ అనేది మొదట ఉగండాలోని జీకా అడవిలో 1947 లో కోతుల్లో కనుగొనబడింది
- మనిషికి సంబంధించినంత వరకు 1952లో ఉగండా మరియు టాంజానియాలో ఈ కేసులు నమోదయ్యాయి
- దీని యొక్క లక్షణాలు
- జ్వరం
- కీళ్ల నొప్పులు
- కండరాల నొప్పులు
- తలనొప్పి అనేది రెండు నుంచి ఏడు రోజులపాటు ఉంటుంది
కేంద్ర ముఖ్య సమాచార కమిషనర్ గా హిరాలాల్ సామారియా
- తెలంగాణ క్యాడర్ కు చెందిన మాజీ IAS అధికారి అయిన హిరాలాల్ సామారియా కేంద్ర ముఖ్య సమాచార కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు
- వీరి నేపథ్యం :-
- హిరాలాల్ సామరియా 1960 సెప్టెంబర్ 14న రాజస్థాన్లో జన్మించారు
- బ్యాచిలర్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ లో సివిల్స్ పట్టాను సాధించారు
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తర్వాత తెలంగాణలో వివిధ హోదాల్లో పని చేశారు
- అలాగే కొన్నాళ్లు కేంద్ర క్యాడర్ గా పనిచేసి పదవి విరమణ చేయడం జరిగింది
- ప్రస్తుతం సమాచార హోదాలో బాధ్యతలు కొనసాగిస్తున్న ఆయనకు కేంద్ర ప్రభుత్వం ఈ పదోన్నతిని కల్పించింది
- సోమవారం ఉదయం రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ముగారు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు
- ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఉపరాష్ట్రపతి అయిన జగదీప్ ధన్ ఖడ్ గారు వీరు ఇరువురు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది
- ఈ నియామకం చేయడానికి గల కారణం :-
- సమాచార కమిషన్ లో ఖాళీలపై దాఖలైన ప్రజాప్రయోజనాల వ్వాజ్యం ఇటీవీల సుప్రీంకోర్టులో విచారణకు రాగా సాధ్యమైనంత త్వరగా పోస్టుల భర్తీ చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రుచుడ్ ధర్మాసనాన్నినిర్దేశించడం జరిగింది అలా కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ నియామకం చేపట్టింది
- ముఖ్య సమాచార కమిషనర్ నియామకంతో పాటు ఇద్దరు కేంద్ర సమాచార కమిషనర్ల నియామకం చేపట్టి౦ది
- వీరిలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ CMD గా పనిచేసిన ఆనంది రామలింగం
- అలాగే హిమాచల్ అటవీ శాఖ హెడ్ ఆఫ్ ఫోర్స్ కం ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటివ్ గా పనిచేసిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి వినోద్ కుమార్ తివారి
- వీరి ఇరువురిని కూడా కేంద్ర సమాచార కమిషనర్ గా నియామకం చేపట్టడం జరిగింది
కేంద్ర విద్యుత్ శాఖకు సంబంధించి అదనపు కార్యదర్శి
- ఆంధ్రప్రదేశ్ క్యాడర్ IAS అధికారి అయిన శ్రీకాంత్ నాగులపల్లి కేంద్ర విద్యుత్ శాఖ అదనపు కార్యదర్శిగా నియమితులు కావడం జరిగింది
- ప్రస్తుతం క్యాబినెట్ సెక్రటరీ సంయుక్త కార్యదర్శి హోదాలో ఉన్న ఆయనను అదనపు కార్యదర్శిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులను జారీ చేసింది
- వారితో పాటు 21 మంది అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ వివిధ శాఖలకు బదిలీ చేసింది
ఈనెల నవంబర్ 13 నుంచి ఢిల్లీలో సరి బేసి విధానం
- ఢిల్లీలో ఆందోళన స్థాయిలో పెరిగిపోయిన కాలుష్యం యొక్క నియంత్రణకు ఈనెల 13 నుంచి వాహనాలకు సరి బేసి అంకెల విధానాన్ని అమలు చేయాలి అని నిర్ణయించారు
- వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ యొక్క చివరణ
- సరి సంఖ్య ఉన్న వాహనాలకు ఒకరోజు
- బేసి సంఖ్య ఉన్న వాహనాలకు మరో రోజున రోడ్లపైకి అనుమతించేటటువంటి విధానాన్ని సరి బేసి విధానంగా పేర్కొంటాము
- ఈ విషయాన్ని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి అయిన గోపాల్ రాయ్ సోమవారం విలేకరులకు వెల్లడించారు
- దానికి గల ప్రధాన కారణం
- ప్రభుత్వం పేర్కొన్న రక్షణ స్థాయిలకు కంటే ఈ కాలుష్యం అనేది ఏడెనిమిది రేట్లు పెరగటంతోని ఈ విధానాన్ని అవలంబిస్తున్నామని ఆయన పేర్కొనడం జరిగింది
ప్రభుత్వ ఉద్యోగాలు. మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం. ఇక్కడ అందుబాటులో ఉంటుంది.
వాటిని అందరికంటే ముందుగానే పొందాలి అంటే YouTube Channel నీ Subscribe చేసుకోండి.
TODAY PDF File :- LINK
Comments
Post a Comment