Elon Musk కి సంబంధించి కొత్త చాట్ బాట్
- డ్రైవర్ రహిత విమానాలు, అంతరిక్ష ప్రయోగాలు, అంతరిక్ష అంతర్జాలం వంటి ఎన్నో ప్రయోగాలకు పెట్టింది పేరు ఈ Elon Musk
- అటువంటి Elon Musk ఇప్పుడు కృతిమ రంగంలోకి అడుగుపెట్టబోతున్నాడు
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI గా ప్రస్తావిస్తాం
- ఆయన కంపెనీ వచ్చేసి X AI
- ఈ కంపెనీ మొట్టమొదటిసారిగా AI నమునాను పరిచయం చేసింది
- దాని పేరు వచ్చేసి గ్రాక్ అని చెప్పి చెప్తాము
- ఈ గ్రాక్ అనేది ఒక చాట్ బాట్
- చాట్ బాట్ అంటే అర్థం మనుషులతో సంభాషణ అనుకరించడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ ని చాట్ బాట్ గా పేర్కొంటాము
- ఈ చాట్ బాట్ గురించి Elon Musk తన యొక్క సామాజిక మాధ్యమైనా X ద్వారా అనగా ట్విట్టర్ ద్వారా ఈ చాట్ బాట్ గురించి వెల్లడించడం జరిగింది
- ఈ చాట్ బాట్ అనేది ఓపెన్ ఏఐకి చెందిన జిపిటి కి, గూగుల్ కు చెందిన పామ్ కి ప్రత్యామ్నాయం కలిగిన ఓ పెద్ద లాంగ్వేజ్ మోడల్ అని గుర్తించాలి
- చాట్ జిపిటి , పామ్ లాగానే ఇది కూడా పనిచేస్తుంది
- 1) ఈ గ్రాక్ అనేది ఎక్స్ లో మాత్రమే పనిచేస్తుంది
- 2) ఎక్స్ ప్రీమియం ప్లస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది
- సూర్యుడు పై పరిశోధన కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన ప్రయోగాన్ని సూర్యయాన్ అంటాము
- ఆ సూర్యయాన్ పేరుతో తొలిసారిగా చేపట్టిన ప్రయోగాన్ని ఆదిత్య - L1 గా పేర్కొంటాము
- Polar Satellite Launching Vehicle c-57 వాహన నౌక ద్వారా 1475 కిలోల బరువు కలిగిన భారత తొలి అంతరిక్ష ఆధారిత సౌర పరిశీలన ఉపగ్రహం ఆదిత్య - L1 నిర్దేశిత భూకక్షలోకి ప్రవేశ పెట్టడం జరిగింది
- 2023 సెప్టెంబర్ 2న ఉదయం 11 గంటల 50 నిమిషాలకు నిర్దేశిత భూకక్షలోకి ప్రవేశ పెట్టడం జరిగింది
- శ్రీహరికోట రెండో ప్రయోగ వేదిక అయినా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV c57 వాహన నౌకా సహాయంతో ఆదిత్య - L1 అనే ఉపగ్రహాన్ని ఇక్కడి నుంచి ప్రయోగించారు
- దీని యొక్క లక్ష్యం
- భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రేంజ్ బిందువు 1 (L1-1) చుట్టూ ఉన్న కక్ష్యలో ఆదిత్య L1 ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు
- ప్రవేశపెట్టి గ్రహణాలతో సంబంధం లేకుండా సౌర గోళం పై నిరంతరం అధ్యయనం చేస్తారు
- ముఖ్యంగా సౌర చర్యలు, అంతరిక్ష వాతావరణంపై వాటి ప్రభావాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించడం దీని యొక్క లక్ష్యం
- ఆదిత్య L1 ఉపగ్రహాం యొక్క ప్రత్యేకతలు
- ఈ ఉపగ్రహం బరువు వచ్చేసి 1475 కేజీలు
- 1) సూర్యుడికి ఉన్న మరో పేరు ఆదిత్య
- 2) ఈ ఉపగ్రహాన్ని లాగ్రేంజ్ అనే బిందువు వద్ద ప్రవేశ పెట్టాలి అనుకున్నారు కాబట్టి Lఅని,
- 3) ఇది సూర్యుడిపై అధ్యయనం చేసే మొదటి ఉపగ్రహము కావున 1 అని
- ఈ ఉపగ్రహాన్ని బెంగళూరులోని ప్రొఫెసర్ యు ఆర్ రావు స్పేస్ సెంటర్లో URSC ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు
- URSC సెంటర్లో పనిచేస్తున్న సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కే శంకర సుబ్రమణియన్ ఆధ్వర్యంలో ఈ ఆదిత్య L1 ఉపగ్రహానికి రూపకల్పన చేయడం జరిగింది
- సౌర జ్వాలలను క్లిక్ మనిపించిన ఆదిత్య L1 ఉపగ్రహం
- సూర్యుడు పై లోతైన పరిశోధన కోసం భారత్ చేపట్టిన ప్రయోగాన్ని సూర్యయాన్ అంటాము అందులో భాగంగా ఆదిత్య L1 ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది
- ఈ ఆదిత్య L1 ఉపగ్రహాం సౌర జ్వాలలకు సంబంధించిన హై ఎనర్జీ ఎక్స్రే చిత్రాన్ని చిత్రాలను తీయగలిగింది
- సౌర జ్వాలలు అంటే సౌర వాతావరణం ఆకస్మాత్తుగా ప్రకాశవంతం కావడాన్ని సౌర జ్వాలగా పేర్కొంటాం
- ఆ సౌర జ్వాలలకు సంబంధించిన చిత్రాలను ఇప్పుడు ఆదిత్య L1 తీయడం జరిగింది
- HEL1OS అనే పరికరం సహాయంతో ఈ చిత్రాలను తీయగలిగింది
- సూర్యుడికి సంబంధించిన హై ఎనర్జీ ఎక్స్రే చర్యలను పరిశీలించి అధిక రిజల్యూషన్ లో ఈ చిత్రాలు మనకు అందిస్తుంది
- సూర్యుడిలోని విస్పోటక శక్తి ఎలక్ట్రాన్ త్వరణం ఇలాంటి మరిన్ని వివరాలను ఈ యొక్క పరికరం నుంచి మనం పొందడానికి అవకాశం ఉంటుంది
- ఉపరితలం నుంచి ఉపరితలం పైనున్న లక్ష్యాలను చేదించగల స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రళయ్ క్షిపణి గా ప్రస్తావిస్తాం
- ఈ ప్రళయ్ క్షిపణి ని భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది
- ఒడిశా తీరానికి చేరువలో ఉన్న అబ్దుల్ కలాం దీవి నుంచి ఉదయం 9 గంటల 50 నిమిషాలకు ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించడం అనేటువంటిది జరిగింది
- ఈ ప్రయోగంలో క్షిపణి యొక్క గమనాన్ని తీరం వెంబడి ఉన్న టాకింగ్ పరికరాలు పూర్తిస్థాయిలో నిశితంగా పరిశీలించడం జరిగింది
- ఈ ప్రళయ్ క్షిపణి యొక్క ప్రత్యేకతలు
- ఈ క్షిపణి 300 నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదిస్తుంది
- అది మాత్రమే కాదు ఈ క్షిపణి 500 - 1000 కిలోల పేలోడ్ ను మోసుకెళ్ళగలుగుతుంది
- ఇది ఘన ఇంధనంతో పనిచేస్తుంది
- ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ప్రయోగిస్తున్న ఇస్కాండర్ క్షిపణి తరహాలోనే ఇది కూడా పనిచేస్తుంది
- దీనిని చైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో మోహరించడం కోసం ప్రత్యేకంగా రూపొందించారు
- DRDO వారు రూపొందించారు
- దేశ రాజధాని ఢిల్లీ లో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని పంజాబ్ హర్యానా ఉత్తర్ ప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాలకు పంట వ్యర్ధాలను తగలబెట్టడాన్ని తక్షణమే నిలిపివేయామని సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది
- జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుదాన్షు దునియాల ధర్మాసనం ఈ ఆదేశాలను ఇవ్వడం జరిగింది
- కాలుష్యం కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతుండడాన్ని చూస్తూ ఊరుకోలేమని ఇది పూర్తిగా ప్రజల ఆరోగ్యాన్ని హతమార్చడమే ఇంతకు మించిన పదబంధం నా వద్ద లేదని తీవ్రంగా వ్యాఖ్యానించింది
- కాలుష్యానికి తాము భాద్యులం కాదంటూ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చెబుతుండడంపై ఆయన స్పందిస్తూ రాజకీయ వైరం అన్నివేళలా తగదని ఢిల్లీ లో వాయు నాణ్యత పడిపోవడానికి సంబంధించిన సమస్యకు పూర్తిగా అడ్డుకట్ట పడాల్సిందేనని అది ఎలా చేస్తారో మాకు అనవసరంకానీ వ్యర్థాలను కాల్చడం మాత్రం ఆగి పొవాలి
- దానికి నిర్బంధ చర్యలే తీసుకుంటారో, ప్రోత్సాహకాలే ఇస్తారో, ఇతరత్రా చర్యలే చేపడుతారు అది మీ ఇష్టం వాటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలి అని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది
- వాటికి పరిష్కారంగా ఐఐటి కాన్పూర్ విద్యార్థులు ఒక పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు
- కృత్రిమ వర్షాల ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చని వారు ఈ ప్రయోగం ద్వారా తెలియపరచడం జరిగింది
- ఈ కృతిమ వర్షాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి ఐఐటి కాన్పూర్ విద్యార్థులకు దాదాపు 5 ఏళ్ల సమయం పడింది
- ఈ ప్రయోగంలో ఒక ప్రత్యేకమైన విమానం ద్వారా రసాయానాలను మేఘాలలో చల్లి సంబంధిత ప్రాంతంలో వర్షాలు కురిపించేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది
- తద్వారా కాలుష్యాన్ని తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది
- అమెరికా, చైనా ,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వంటి దేశాల్లో సహజంగానే నీటి కొరత ఏర్పడుతుంది
- అలా నీటి కొరత ఏర్పడినప్పుడు వారందరూ కూడా ఈ పద్ధతిని పాటించడం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించాలి
ప్రభుత్వ ఉద్యోగాలు. మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం. ఇక్కడ అందుబాటులో ఉంటుంది.
వాటిని అందరికంటే ముందుగానే పొందాలి అంటే YouTube Channel నీ Subscribe చేసుకోండి.
TODAY PDF File :- LINK
Comments
Post a Comment