అణ్వస్త్ర ఆందోళనలు
- సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పంద నుంచి రష్యా బయటికి రావడం
- ప్రపంచవ్యాప్తంగా అణ్వస్త్ర ఆందోళనలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు
- దీనినే ఇంగ్లీషులో Comprehensive Nuclear Test Ban Treaty గా పేర్కొంటాం
- ఈ ఒప్పందం 1996వ సంవత్సరంలో జరిగింది
- ఈ ఒప్పందంపై 187 దేశాలు సంతకాలు చేశాయి
- 178 దేశాలు మాత్రమే ఈ ఒప్పందాన్ని సజావుగా అమలు చేయాలని నిర్ణయించాయి
- భారత్ మరియు పాకిస్తాన్ తో పాటు మిగిలిన 9 దేశాలు ఈ CTBT పై సంతకాలు చేయలేదు
- ఏ ఒప్పందాని కైనా రెండు పద్ధతులు ఉంటాయి
- 1) సిగ్నేచర్
- 2) రాటిఫికేషన్
- సిగ్నేచర్ అంటే :- ఒక దేశం యొక్క ప్రతినిధి అంతర్జాతీయంగా ఆ ఒప్పందానికి సంబంధించి ఒక ఫస్ట్ స్టెప్ తీసుకోవడం
- రాటిఫికేషన్ :- ఏ దేశమైతే ఆ ఒప్పందం మీద సంతకం చేస్తుందో ఆ దేశం యొక్క పార్లమెంట్లో ఆ దేశం ఆ ఒప్పందం ప్రకారం దేశీయంగా చట్టాలు చేయడం జరుగుతుంది
- ఈ CTBT ఒప్పందంపై 187 దేశాలు సిగ్నేచర్ చేస్తే
- 178 సిగ్నేచర్ + రాటిఫికేషన్ చేయడం జరిగింది
- ఇందులో భారత్, పాకిస్తాన్ , నార్త్ కొరియా సిగ్నేచర్ రాటిఫికేషన్ ఈ రెండు చేయలేదు
- అమెరికా సిగ్నేచర్ చేస్తే రాటిఫికేషన్ చేయలేదు
- రష్యా మాత్రం సిగ్నేచర్ + రాటిఫికేషన్ రెండు చేసింది
- ప్రస్తుతం రష్యా ఈ రాటిఫికేషన్ సంబంధించిన అంశాన్ని డి రేటిఫికేషన్ చేసుకుంది
- దానికి గల కారణం
- ఈ CTBT కి సంబంధించిన అంశం పైన అమెరికా రాటిఫికేషన్ చేసుకోకపోవడం
- Ratify చేసుకున్న రష్యా కూడా డి రాటిఫై చేసుకొని అమెరికా సరసన నిలిచింది
- భారత్ విషయానికి వచ్చినట్లయితే
- భారత్ రాటిఫికేషన్ చేయలేదు అలా అని సైన్ కూడా చేయలేదు
- దానికి గల కారణం
- అన్వస్త్ర పరీక్షలతోపాటు, అన్వాయిదాలు లేని ప్రపంచాన్ని ఆవిష్కరించాలని భారత్ దీర్ఘ కాలంగా ఎదురుచూస్తుంది =} డిమాండ్ కూడా చేస్తుంది
- 1954 వ సంవత్సరంలో అమెరికా క్రేజీల్ బ్రావో పేరుతో అణు పరీక్షలు నిర్వహించింది
- ఆ పేలుడుకి సంబంధించిన తీవ్రత అనేది హిరోషిమా కన్నా కొన్ని వందల రెట్లు ఎక్కువ ఉండటం జరిగింది
- ఎప్పుడైతే దాని తీవ్రత 100 రెట్ల కంటే అధికంగా ఉందని తెలిసిందో ఒక్కసారిగా అంతర్జాతీయ సమాజం భయంతో వణికిపోయింది
- ఈ పరీక్షల కారణంగా చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక దీవుల్లో ఉన్న సముద్ర జలాలపై కొన్ని ఏళ్ల పాటు రేడియేషన్ కీ దారితీసింది
- అమెరికా ఈ అణు పరీక్షలు చేసిన తర్వాత ప్రధానిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ అమెరికా చేసిన ఈ అణు పరీక్షలను తీవ్రంగా వ్యతిరేకించాడు
- అన్వాస్త్రాలను కలిగిన దేశాలు అవి లేని వాటిపై ఆధిపత్యం చెలాయించే ప్రమాదం ఉందని వాదించడం కూడా జరిగింది
- కాకపోతే 1964 సంవత్సరంలో ఎప్పుడైతే చైనా అణు పరీక్షలు నిర్వహించిందో పొరుగునున్నటువంటి దేశంతో ప్రమాదం ఉందని భావించిన భారత్ ఈ సిటీబీటీ పైన సంతకం చేయడానికి నిరాకరించింది
- భారత్ ఇప్పటివరకు రెండు సార్లు మాత్రమే అణు పరీక్షలను నిర్వహించింది
- మొదటగా 1974 సంవత్సరం పోఖ్రన్ కేంద్రంగా మొదటిసారి అణు పరీక్షలు నిర్వహిస్తే
- రెండోసారి 1998వ సంవత్సరం లో చైనా సాయంతో పాకిస్తాన్ అన్వాయిదాలు సమకూర్చుకొనుందన్నా నిఘా వర్గాల సమాచారంతో
- 1998 సంవత్సరంలో భారత్ రెండోసారి అణు పరీక్షలు నిర్వహించడం జరిగింది
- ఏసీ అవసరంలేని ప్రయాణికుల కోసం కొత్తగా ప్రవేశపెట్టబోయే రైళ్లను వందే సాధారణ్ రైళ్లు గా పేర్కొంటాం
- తొలుత ఈ రైళ్లను ఢిల్లీ-ముంబై మార్గంలో వీటిని ప్రవేశపెట్టనున్నారు
- అత్యంత ప్రాచుర్యం పొందిన వందే భారత రైళ్ల తరహాలోనే వీటిని కూడా రూపొందించారు
- కానీ వందే భారత్ రైలుకు ఉండే అత్యున్నతమైన వసతులు ఈ రైలుకు ఉండవని గ్రహించాలిఅంటే అర్థం ఏసీ సౌకర్యంగాని , ఆటోమేటిక్ గా క్లోజ్ అయ్యే Doors గాని ఇలాంటి వసతులు ఉండవని అభ్యర్థులు గమనించాలి
- ఈ వందే సాధారణ్ రైళ్లు యొక్క ప్రత్యేకతలు
- ఈ రైల్లో 12 స్లీపర్ కోచ్లు 8 అన్ రిజర్వ్ డ్ బోగీలు ఉన్నాయి
- ఈ సాధారణ రైల్లో రెండు చివరల ఇంజన్ను కలిగి ఉంటాయి ఆ రెండు ఇంజిన్ లను సిగ్నలింగ్, ట్రాక్ ల వీలుని బట్టి వినియోగిస్తారు
- ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ప్రతి భోగిలో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు
- భోగి లోపల అదునాతనమైన సాంకేతికతతో కూడుకున్న వసతులు ఏర్పాటు చేయబడ్డాయి
- గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ఈ వందే సాధారణ్ రైళ్లు ప్రయాణం చేస్తాయి
- ఒకేసారి 1834 మంది ప్రయాణికులు ప్రయాణించే సామర్థ్యాన్ని కూడా ఇవి కలిగి ఉన్నాయి
- మొదటి దశలో ఐదు మార్గాల్లో ఈ సాధారణ రైళ్ళను ప్రారంభించడానికి రైల్వే శాఖ సిద్ధం చేస్తుంది ఏంటా 5 మార్గాలు అంటే
- ముంబై - ఢిల్లీ
- పాట్నా- ఢిల్లీ
- హవ్ డా - ఢిల్లీ
- హైదరాబాద్ - ఢిల్లీ
- ఎర్నాకులం - గువాహాటి
- మరో 30 మార్గాల్లో వీటిని ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ అడుగులు వేస్తుంది
- తొలుత ఈ రైళ్లను ఢిల్లీ-ముంబై మార్గంలో ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించిందని చెప్పుకుందాం కదా
- అందులో భాగంగానే ముంబై నుంచి అహ్మదాబాద్ మద్య ఈ వందే సాధారణ్ రైల్ యొక్క ట్రయల్ రన్ అనేది విజయవంతం కావడం జరిగింది
భారత్ నుంచే అత్యధిక యూనివర్సిటీలు
UK , లాఫింగ్ గ్యాస్ కి సంబంధించిన అంశం
ఉత్తరాఖండ్ రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవం
- ఆసియా దేశాల్లోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలకు సంబంధించి ప్రతిష్టాత్మక క్వాకరెల్లి సైమండ్స్(QS) అనే సంస్థ 2024 ఏడాదికి గాను బుధవారం ర్యాంకులను విడుదల చేసింది
- ఈ ర్యాంకుల్లో మన దేశం నుంచి ప్రఖ్యాతి విశ్వవిద్యాలయాలైన
- ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ తొలి 50 స్థానాల్లో నిలిచాయి
- ఐఐటి బాంబే 40వ స్థానాన్ని సంపాదిస్తే
- ఐఐటి ఢిల్లీ 46వ స్థానంలో చోటు సంపాదించుకుంది
- ఈ యొక్క నివేదికను రూపొందించడం కోసం ప్రముఖ క్యూఎస్ (QS) అనే సంస్థ దాదాపుగా ఆసియా కాంటినెంట్ లో ఉన్న 856 యూనివర్సిటీలను పరిశీలించడం జరిగింది
- ఈ యొక్క జాబితాలో
- భారత్ నుంచి అత్యధికంగా 148 విశ్వవిద్యాలయాలు చోటు సంపాదించుకుంటే
- చైనా నుంచి 133 విశ్వవిద్యాలయాలు
- జపాన్ నుంచి 96 విశ్వవిద్యాలయాలు ఈ జాబితాలో చోటు సంపాదించుకోవడం జరిగింది
- ఇక మయన్మార్, కాంబోడియా, నేపాల్ ఈ జాబితాలో తొలిసారిగా మెరిసాయి
- గతేడాది ఇదే నివేదికలో భారత్ నుంచి 111 యూనివర్సిటీలు ఎంపిక అయితే ఈ ఏడాది ఆ సంఖ్య అనేది 148 చేరింది ఈ విషయాన్ని గమనించాలి
- నైట్రస్ ఆక్సైడ్ ను మనం లాఫింగ్ గ్యాస్ గా పిలుచుకుంటాము
- వినోద భరిత కార్యకలాపాల కోసం వినియోగించడాన్ని బ్రిటన్ ప్రభుత్వం బుధవారం నిషేధం విధించింది
- దానికి గల కారణం
- ఈ నైట్రస్ ఆక్సైడ్ అనే డ్రగ్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల రక్తహీనతన బారిన పడేటువంటి అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు
- దీన్ని యొక్క తీవ్రత గనక ఎక్కువైతే నరాలు దెబ్బతినడంతో పాటు పక్షవాతం వచ్చేటటువంటి ప్రమాదం ఉందని కూడా వారు పేర్కొనడం జరిగింది
- బ్రిటన్ లోని 16 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారే ఈ డ్రగ్ను ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది
- వారందరి ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని బ్రిటన్ ప్రభుత్వం నైట్రస్ ఆక్సైడ్ ను నిషేధించింది
- మినహాయింపు ఇచ్చిన అంశాలు
- హెల్త్ సెక్టార్
- కొన్ని పరిశ్రమలకు చట్టబద్ధంగా వినియోగిస్తున్నటువంటి వాటికి మాత్రమే మినహాయింపు ఇవ్వడం జరిగింది
- ప్రతి ఏటా నవంబర్ 9న ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహిస్తాము
- దానికి గల కారణం
- ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉత్తరాఖండ్ రాష్ట్రం అనేది వేరుపడింది అనగా కొత్తగా రాష్ట్రం ఏర్పాటు చేయబడింది
- 2000 సంవత్సరం నవంబర్ 9న ఉత్తరప్రదేశ్ నుంచి వేరుపడి భారతదేశంలో 27వ రాష్ట్రంగా అవతరించింది
- తొలినాళ్లల్లో ఉత్తరాంచల్ పేరుతో ఏర్పాటు కావడం జరిగింది
- ఈ 2007వ సంవత్సరంలో ఆ ఉత్తరాంచల్ పేరుని ఉత్తరాఖండ్ గా మార్చారు
- ఉత్తరాఖండ్ అనేటువంటి పదం సంస్కృత మాండలికం నుంచి వచ్చింది
- ఉత్తరాఖండ్ అంటే అర్థం ఉత్తర నగరం
- ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క ప్రత్యేకతలు
- ప్రకృతి సౌందర్యానికి, సాంస్కృతిక వైవిధ్యానికి, మతపరమైన ప్రాముఖ్యతకు పెట్టింది పేరు
- చార్ధామ్ , బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి మరియు యమునోత్రి నాలుగు పవిత్ర హిందూ పుణ్యక్షేత్యాలకు నిలయంగా ఈ ప్రాంతం నిలిచింది
- యునెస్కో వారు గుర్తించిన ప్రపంచ వారసత్వ సంపదలకు సంబంధించి ఉత్తరాఖండ్ నుంచి రెండు ప్రదేశాలు దీంట్లో చోటు సంపాదించుకున్నాయి
- వాల్యూ ఆఫ్ ఫ్లవర్స్
- నందాదేవి నేషనల్ పార్క్
ప్రభుత్వ ఉద్యోగాలు. మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం. ఇక్కడ అందుబాటులో ఉంటుంది.
వాటిని అందరికంటే ముందుగానే పొందాలి అంటే YouTube Channel నీ Subscribe చేసుకోండి.
TODAY PDF File :- LINK
Comments
Post a Comment