బిర్సా ముండా
- చోటా నాగపూర్ పీఠభూమి ప్రాంతంలోని ముండా తెగకు చెందిన గిరిజన నాయకుడు
- 15 నవంబర్ 1875 బిర్సా ముండా జన్మించారు
- ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ గారు నివాళులు అర్పించారు
- బిర్సా ముండాకు సంబంధించి ప్రత్యేకతలు
- బ్రిటిష్ వలస రాజ్యాల ఉనికిని పూర్తిస్థాయిలో ప్రతిఘటించాడు
- దానికి గల కారణం
- బ్రిటిష్ వారు గిరిజనులను క్రైస్తవ మతంలోకి మార్చడం జరుగుతుంది
- క్రైస్తవ మతంలోకి మార్చడాన్ని ఆయన పూర్తిస్థాయిలో వ్యతిరేకించాడు
- బీర్ సైత్ అనే సంస్థను స్థాపించి ఆ గిరిజనులలో విశ్వాసాన్ని కలిగించాడు
- ఈ సంస్థ ద్వారా మతమార్పిడికి సంబంధించిన ప్రయత్నాలు పూర్తిస్థాయిలో ప్రతిఘటించాడు
- ముండా తెగకు ముందుండి నాయకత్వం వహించాడు
- ముండారాజ్ ను స్థాపించాలి అనుకున్నాడు
- ముండా రాజ్ అంటే Self Rule అని అర్థం
- అడవి పైన అదే విధంగా భూమి పైన పూర్తి స్థాయిలో గిరిజనులకే హక్కు ఉండడం దాన్నే ముండా రాజ్ అంటాము
- వలసవాద చట్టాలను అదేవిధంగా శిస్తూ చెల్లించడాన్ని నిరాకరించాడు
- ఈయన ఉల్గులన్ అనే ఉద్యమాన్ని ప్రారంభించారు
- ఈ ఉద్యమంలో గెరిల్లా యుద్ద తంత్రం మనకు ప్రధానంగా కనిపిస్తుంది.
- మతమార్పిడులకు ప్రయత్నించేటటువంటి వారిని దీని ద్వారా తీవ్రంగా వ్యతిరేకించాడు
- గిరిజనుల్లో సామాజిక మార్పును తీసుకువచ్చింది
- ఈ ఉల్గులన్ ఉద్యమం అనేది ముండారాజ్ సంస్థ ను స్థాపించడానికి కారణమైంది
- ఈయన అనుచరులు భగవాన్ గా =} దేవుడిగా
- ధరితి అబా గా =} భూమి తండ్రిగా బీర్సా ముండాను కొలవడం జరుగుతుంది
- ఆయన జన్మదినాన్ని జనజాతీయ గౌరవ దివాస్ గా జరుపుకుంటాం
- ఝార్ఖండ్ రాష్ట్రం 2000 నవంబర్ 15 ఏర్పాటు అయింది
- భగవాన్ బీర్సా ముండా జయంతి రోజునే జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది
- జార్ఖండ్ అంటే అర్థం అటవీ భూమి
19/11/2023 PDF File :- LINK
TODAY PDF File :- LINK
15/11/2023 PDF File :- LINK
మాదిగ ఉప వర్గీకరణ
- ఇటీవల నరేంద్ర మోడీ గారు తెలంగాణలోని హైదరాబాద్ లో జరిగిన సదస్సులో షెడ్యూల్ కులాల(SC)లో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ఉప వర్గీకరణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ఈ సదస్సులో పేర్కొనడం జరిగింది
- షెడ్యూల్ కులాలను ఏ,బి,సి,డి గ్రూపులుగా వర్గీకరించడాన్నే SC ఉప వర్గీకరణ గా ప్రస్తావిస్తాం
- సమాన ప్రాతిపదికన రిజర్వేషన్లు ఫలాలు అనేటువంటి పంపిణీ చేపడతాయి
- 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో
- మొత్తం ఎస్సీ జనాభా 1,38,78,078 మంది ఉంటే
- మాదిగలు = 67,02,609 మంది ఉన్నారు,
- మాలలు = 55,70,244 మంది జనాబా ఉన్నారు
- తెలంగాణ రాష్ట్రంలో మొత్తం SC జనాభాలో మాదిగ సామాజిక వర్గం దాదాపు 50% పైగా ఉన్నారు
- 1994 నుంచి SC ఉప వర్గీకరణ కోసం పోరాడుతూ, వాదిస్తూ వస్తున్నారు
- దానికి కారణం ఎస్సీ కేటగిరి కి కేటాయించిన రిజర్వేషన్స్ అనేవి మాల సామాజిక వర్గం వారే ఎక్కువ లబ్ధి పొందుతున్నారు
- ఉప వర్గీకరణ చేయడం ద్వారా సమాన ప్రాతిపదికన రిజర్వేషన్లు ఫలాలు అనేవి అందరికీ అందించబడతాయి
- మాదిగలు చారిత్రాత్మకంగా చూస్తే చర్మ శుద్ధి , తోలు పని
- అదే విధంగా చిన్న చిన్న చేతి పనులు తో సంబంధం కలిగి ఉన్నారని మనం గమనించవచ్చు
- వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు అత్యధికంగా మాదిగ సామాజిక వర్గానికే చెందిన వారనే గుర్తించాలి
19/11/2023 PDF File :- LINK
TODAY PDF File :- LINK
15/11/2023 PDF File :- LINK
జార్ఖండ్ వ్యవస్థాపక దినోత్సవం
- బీహార్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2000 ద్వారా భారత దేశంలో 28వ రాష్ట్రంగా జార్ఖండ్ రాష్ట్రం ఆవిర్భవించింది
- బీహార్ కి దక్షిణ దిగువన ఉన్నటువంటి చోటా నాగపూర్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం మొత్తం కలుపుకొని జార్ఖండ్ రాష్ట్రం అనేటువంటిది ఏర్పాటు కావడం అనేది జరిగింది
- 2000 సంవత్సరం నవంబర్ 15న జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిందని గుర్తించాలి
- భగవాన్ బీర్సా ముండా జయంతి రోజునే జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిందని,
- జార్ఖండ్ అంటే అర్థం అటవీ భూమి అని పైన చెప్పిన అంశం లో చదువుకొన్నాము
- జార్ఖండ్ రాష్ట్రం యొక్క ప్రత్యేకతలు
- జార్ఖండ్ రాష్ట్రము గొప్ప ఖనిజ సంపదకు ప్రసిద్ధి చెందింది
- యురేనియం, మైకా, బాక్సైట్ , గ్రానైట్ ,గోల్డ్ సిల్వర్, గ్రాఫైట్, డోలమైట్, మ్యాగ్న టైట్, బొగ్గు, ఇనుము, రాగి వంటి గొప్ప ఖనిజ సంపద ఇక్కడ మనకు లభ్యమవుతుంది
- 32 శాతం బొగ్గు ఝార్ఖండ్ నుంచి లభిస్తుంది
- 25% రాగి జార్ఖండ్ నుంచే పొందడం జరుగుతుంది
19/11/2023 PDF File :- LINK
TODAY PDF File :- LINK
15/11/2023 PDF File :- LINK
భారతీయ మహిళా సరికొత్త రికార్డు
- ప్రముఖ భారతీయ మహిళ స్కై డైవర్ పద్మశ్రీ అవార్డు గ్రహీత శీతల్ మహాజాన్ అరుదైన రికార్డును సృష్టించారు
- ఎవరెస్టు శిఖరం ముందు 21500 అడుగుల ఎత్తులో ఉన్న హెలికాప్టర్ నుంచి స్కై డైవ్ చేయడం అనేది జరిగింది
- అలా స్కై డైవ్ చేసి 17444 అడుగుల ఎత్తులో ఉన్న కాలాపత్తర్ లో సేఫ్ గా లాండ్ అయ్యారు
- ప్రపంచంలోనే ఈ తరహా భారీ విన్యాసం చేసిన తొలి మహిళగా చరిత్రలో నిలిచారు
- శీతల్ మహాజన్ గతంలో కూడా స్కై డైవింగ్ చేసి ఇప్పటికే పలు రికార్డులను పొందారు
- ఈ భారీ విన్యాసాలన్నీ పూర్తి చేసి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు
19/11/2023 PDF File :- LINK
TODAY PDF File :- LINK
15/11/2023 PDF File :- LINK
2030 నాటికి తగ్గేది రెండు శాతం ఉద్గారాలే
- 2015 వ సంవత్సరంలో నవంబర్ 30 నుండి డిసెంబర్ 12 వరకు ఫ్రాన్స్ లోని పారిస్ లో కాప్ 21 కి సంబంధించి ఒక సమావేశం అనేది జరిగింది
- ఈ సమావేశం యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడింది
- దీంట్లో మనకు 195 దేశాలు పాల్గొన్నాయి
- ఈ సమావేశం యొక్క ప్రత్యేకతలు
- ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీల సెంటీ గ్రేడ్ లోపు పరిమితం చేయాలని ఈ ఒప్పందంలో ప్రధానంగా పేర్కొనడం జరిగింది
- ఇలా హానికరక ఉద్గారాలకు కళ్లెం వేయాలని ఘనంగా మన లక్ష్యాలు పెట్టుకున్నప్పటికీ కూడా ప్రస్తుతం పోకడాలు ప్రకారం చూస్తే వాటిని సాధించడం కష్టమేనని నిపుణులు చెబుతున్నారు
- 2030 నాటికి 43% మేరా ఈ ఉద్గారాలను కళ్లెం వేస్తే తప్ప ఈ తీవ్ర దుష్ప్రభావాలను అడ్డుకోవడం సాధ్యం కాదు
- ఐరాస యొక్క తాజా నివేదిక ప్రకారం ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా రెండు శాతం మాత్రమే అడ్డుకట్ట వేయగలమని పేర్కొనడం జరిగింది
19/11/2023 PDF File :- LINK
TODAY PDF File :- LINK
15/11/2023 PDF File :- LINK
ప్రభుత్వ ఉద్యోగాలు. మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం. ఇక్కడ అందుబాటులో ఉంటుంది.
వాటిని అందరికంటే ముందుగానే పొందాలి అంటే YouTube Channel నీ Subscribe చేసుకోండి.
TODAY PDF File :- LINK
Comments
Post a Comment